![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-7 లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో మొదట రైతు బిడ్డ ప్రశాంత్ ఉంటే ఆ తర్వాత కార్తీక దీపం మోనిత అలియాస్ శోభాశెట్టి ఉందనే చెప్పాలి. హౌస్ లోకి వెళ్ళినప్పుడు మొదట్లో చాలా సాధారణంగా కనిపించిన శోభాశెట్టి.. మెల్లి మెల్లిగా చంద్రముఖిలా మారిపోయిందంటూ ప్రతీవారం ఫుల్ ట్రోల్స్ వచ్చేవి. వాటిని వీకెండ్ మీమ్స్ అండ్ ట్రోల్స్ లో హోస్ట్ నాగార్జున బిగ్ స్క్రీన్ మీద వేసి చూపించాడు.
బిగ్ బాస్ హౌస్ లో శోభాశెట్టి ఆటతీరు, మాటతీరుకి ప్రేక్షకులు తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు ప్రియాంక, అమర్ దీప్ లతో కలిసి గ్రూప్ గా ఉంటు టాస్క్ లలో కూడా గ్రూప్ గా ఆడుతూ, నామినేషన్ టైమ్ లో అందరు కలిసి ఎవరెవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకోవడం అన్నీ కూడా తనకి మరింత నెగెటివ్ ఇంప్రెషన్ తీసుకొచ్చాయి. అయితే ఆటలో ఉన్నప్పుడు ఫౌల్ చేస్తే పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ మరీ సంఛాలక్ గా ఉండి కూడా ప్రియాంక, అమర్ దీప్ లకి సపోర్ట్ చేసేది. ఇక మొదటి వారం నుండి కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసి శోభాశెట్టి, అమర్ దీప్, ప్రియాంక కలిసి చేసిన నామినేషన్ లు చాలానే ఉన్నాయి.
ఇక అందరు కలిసి ప్రశాంత్ ని టార్గెట్ చేయడంతో శివాజీ అతనికి సపోర్ట్ చేస్తూ నిలిచాడు. ప్రతీసారీ ప్రశాంత్ కి వెన్నెంటే ఉండటంతో శోభాశెట్టి, అమర్, ప్రియాంక వాళ్ళు జెలస్ తో ఏదో ఒక కారణంతో నామినేషన్ లో పెట్టేవాళ్ళు. అతడికి గాయాలు చేస్తూ ఇబ్బందిపెట్టేవాళ్ళు. అయితే శోభాశెట్టి హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేవాళ్ళు ఎందుకంటే తనెంత చెత్త ఫర్ఫామెన్స్ ఇచ్చిన, ఓటింగ్ లో ఎంత లీస్ట్ లో ఉన్న తను మాత్రం ప్రతీవారం సేఫ్ అయ్యేది.
శోభాశెట్టి సంఛాలక్ గా ఎన్నిసార్లు ఫెయిల్ అయిన బిగ్ బాస్ మాత్రం తననే సంఛాలక్ చేసేవాడు. అలా ప్రతీవారం తను ఎలిమినేట్ అవ్వాలని ప్రేక్షకులు ఓట్లు వేయకుండా తనకన్న దిగువన ఏ కంటెస్టెంట్ ఉన్నా వారికి భారీగా ఓట్లేసేవారు. అయిన బిగ్ బాస్ తననే సేవ్ చేసేవాడు. అందుకే ఈ దత్తపుత్రికని లాస్ట్ వీక్ వరకు ఉంచాడు. ఇక ఫినాలేకి ఒక్క వారం ముందు శోభాశెట్టిని ఎలిమినేషన్ చేసి ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించాడు. అయితే శోభాశెట్టి ఎలిమినేషన్ తర్వాత ఎంతోమంది ప్రేక్షకులు.. నువ్వు ఎప్పుడో బయకు రావాల్సింది, చాలా లేట్ గా వచ్చవంటూ కామెంట్లు చేశారు.
అయితే శోభాశెట్టి బిగ్ బాస్ తర్వాత తన షూటింగ్ పనుల్లో బిజీ అయింది. ఇప్పుడు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్లాగ్ ని అప్లోడ్ చేసింది. ఇందులో వాళ్ళ అమ్మ కోసం ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తీసుకుంటున్నట్టు చెప్పింది శోభా. ప్రస్తుతం షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న శోభా త్వరలో వాళ్ళ అమ్మ కోసం బెంగుళూరు వెళ్తున్నట్టు, అందుకే తనకి గుర్తుండిపోయేలా ఏదైన సిల్వర్ జ్యువలరీ తీసుకోవాలనుకుందంట. అందుకే కొత్తగా ప్రారంభమైన ఓ జ్యువలరీ షోరూమ్ లోకి షాపింగ్ కి వెళ్ళింది. ఇక వాళ్ళ అమ్మ కోసం సర్ ప్రైజ్ షాపింగ్ చేశానంటు తీసి తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |